కడెం ప్రాజెక్టు వద్దనున్న హరిత టూరిజం హోటల్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వకూడదు : చాడ వెంకటరెడ్డి

-

నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టు వద్దనున్న హరిత టూరిజం హోటల్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వకుండా టూరిజం కార్పోరేషన్‌ నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని గురువారం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లుగా వెల్లడించారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలం రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పర్యాటక ప్రాంతాలలో ప్రభుత్వం భూమి ఇచ్చి హరిత టూరిజం హోటల్స్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. హోటళ్లను నడుపుటకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.హరిత హోటల్స్‌ అన్ని లాభాల బాటలోనే నడుస్తున్నాయని తెలిపారు.

అందులో నిర్మల్‌ జిల్లా, కడెం ప్రాజెక్టు వద్దనున్న హరిత టూరిజం హోటల్‌ కూడా లాభాల బాటలోనే నడుస్తుందని వెల్లడించారు.ఆ హోటల్‌ను ప్రైవేట్‌పరం చేయడానికి కొంతమంది అధికారులు, బయటి వ్యక్తులతో కుమ్మకై ప్రైవేట్‌ పరం చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనితీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ విషయంపై విజిలెన్స్‌ అధికారులతో విచారణ చేపట్టాలనివిజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రభుత్వానికి టూరిజం తరుఫున నడుస్తున్న హోటల్స్‌ను ప్రైవేట్‌పరం చేయాలనే ఆలోచన ఉంటే, అలాంటి ఆలోచనను విరమింప చేసుకోవాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news