తొడలు చూపించేందుకు యాత్ర చేస్తున్నారా? చంద్రబాబు బూట్లు నాకడం మానండి – గుడివాడ

-

తొడలు చూపించేందుకు యాత్ర చేస్తున్నారా ? అంటూ అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి గుడివాడ అమర్నాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఆత్మగౌరవం ఉందని చెప్పటానికే రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందని.. పాదయాత్ర ద్వారా రేపు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు.

అమరావతిని అభివృద్ధి చేయొద్దని రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరూ అనలేదు.. చరిత్రలో జరిగిన తప్పు మరోసారి జరగకూడదనే ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాల అభివృద్ధి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. కొంత మంది దఫేదారులు, బంట్రోతులు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

ప్రభుత్వం పాదయాత్రకు అనుమతి ఇవ్వమని చెప్పాం.. కోర్టు ఏం చెప్పింది? అని నిలదీశారు. పాదయాత్ర చేస్తున్నారా?? తొడల యాత్ర చేస్తున్నారా?? అని ఆగ్రహించారు. తొడలు చూపించేందుకు యాత్ర చేస్తున్నారా?? దీనికి స్పందన వస్తే ఏం చేస్తారు?! చంద్రబాబు బూట్లు నాకడం మానేయండంటూ ఓ రేంజ్‌ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version