గుజరాత్ లో ఘోర ప్రమాదం… సముద్రంలో మునిగిన 15 పడవలు. పలువురు గల్లంతు.

-

గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో 15 పడవలు మునిగి 11 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.  ఈ ప్రమాదం గుజరాత్ లోని గిర్ సోమనాథ్ తీరంలో అరేబియా సముద్రంలో చోటు చేసుకుంది. సముద్రంలో గాలులు, అలల తీవ్రతకు సముద్రంలో పడవలు ముగిగాయి. అయితే ముందుగా 15 మంది సముద్రంలో గల్లంతు అవ్వగా… నలుగురిని స్థానికులు రక్షించారు. అప్రమత్తం అయిన అధికారులు గల్లంతైన వారికోసం రక్షణ చర్యలు ప్రారంభించారు.

కాగా.. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో సముద్రంలో అలలు, గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీంతోనే ప్రమాదం ఏర్పడింది. నవబందర్ ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news