‘జనతా గ్యారేజ్’ సంఘటనకు 23 మంది పై కేసు నమోదు…

-

సినిమా ల ప్రభావం రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల గుంటూరు జిల్లాలో కత్తిపట్టుకుని యువకులు హల్ చల్ చేసిన సంఘటనే నిదర్శనం.  ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమాను ఆదర్శంగా తీసుకుని.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో ‘జనతా గ్యారేజీ’ పేరుతో ప్రదీప్‌ అనే యువకుడు కత్తి పట్టుకుని స్థానికులను భయబ్రాంతులకు గురిచేసిన కేసులో మొత్తం 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జనతా గ్యారేజీ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 5వ తేదీన ఉండవల్లిలో ప్రదీప్ అనే యువకుడు నడిరోడ్డుపై కత్తితో తిరుగుతూ.. నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కరిస్తానని ఫోన్‌లో మాట్లాడటం కలకలం రేపింది.   ఉండవల్లికి చెందిన యువకులు జనతాగ్యారేజీ పేరుతో ఓ వాట్సప్‌ గ్రూప్ లో సమస్యలను స్వీకరిస్తున్నారు. చట్టాలను అతిక్రమించడం వల్ల కేసు నమోదు చేస్తున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news