గుంటూరు సీతానగరం రేప్ కేసు నిందితుడి అరెస్ట్

-

గుంటూరు: సీతానగరంలో యువతిపై రేప్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు తాజాగా పురోగతి సాధించారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు ఒంగోలులో అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. తాడేపల్లి సీతానగరంలో సాయంత్రం సమయంలో పెళ్లి చేసుకోబోతున్న యువజంట కృష్ణా నది ఒడ్డున ఏకాంతంగా మాట్లాడుకునేందుకు వెళ్లారు. అయితే చీకటి పడటంతో కృష్ణా, వెంకట్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయారు. జంటపై దాడి చేయడంతో పాటు యువకుడి కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నిందితులు పారిపోయారు.

rape

ఈ ఘటనపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేశారు. అయితే కృష్ణా, వెంకట్ రెడ్డి గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లుగా పోలీసులు గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసలై డబ్బుల కోసం కృష్ణానది ఒడ్డుకు వచ్చిన జంటలపై చాలా సార్లు దాడులకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా సీరియస్ అయ్యారు. పోలీసుల బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలించారు. ఇన్నాళ్లకు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version