మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… దసరా రోజున బిగ్ అప్డేట్!

-

త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం “గుంటూరు కారం”.. వీరి కాంబినేషన్ కు ఫ్యాన్స్ మాములుగా లేరు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం నుండి ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ గురించి చిత్ర బృందం రెవీల్ చేసింది. వచ్చే వారం మొదట్లో దసరా పండుగా రానుండడంతో ఈ సినిమా నుండి మొదటి సింగిల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఆ సాంగ్ కు సంబంధించిన పెండింగ్ వర్క్ ను ఫినిష్ చేసే పనిలో సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ అండ్ టీం బిజీ గా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి మరియు యంగ్ సెన్సేషన్ శ్రీలీల లు నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులకు చాలా అంచనాలు ఉండగా ఏ మేరకు అందుకుంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news