బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కు కీలక పదవి

-

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, రాజ్య సభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు కు మరో కీలక పదవి దక్కింది. ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్‌ చైర్మన్‌ గా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, రాజ్య సభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు తాజాగా టొబాకో బోర్డు మెంబర్‌ గా ఎన్నిక అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా… రాజ్య సభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు తాజాగా ప్రకటన చేశారు.

టొబాకో చట్టం 1975 ప్రకారం బోర్డులో ఒక రాజ్య సభ సభ్యుడు కూడా ఉండాలని… ఆ విధంగా టొబాకో బోర్డులో రాజ్య సభ నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని వివరించారు. ఇక పై పొగాకు సాగు చేసే రైతుల ప్రయోజనాల కోసం తాను కృషి చేస్తానని ప్రకటన చేశారు. పొగాకు ఎగుమతులు పెరిగేందుకు సహకారం అందిస్తానని జీవీఎల్‌ స్పష్టం చేశారు. కాగా.. జీవీఎల్‌ నియామకం పై రాజ్య సభ సెక్రటేరియట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news