హుజురాబాద్ వాసులకు బంప‌రాఫ‌ర్..టీఆర్ఎస్ గెలిస్తే 5వేల ఇళ్లు..!

-

హుజురాబాద్ ఎన్నిక‌లు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అధికార పార్టీ నియోజ‌క‌ర్గంపై వ‌రాల జ‌ల్లు కురిపిస్తుండ‌గా ప్ర‌తిప‌క్ష పార్టీలు హామీలు ఇస్తున్నాయి. తాజాగా హ‌రీష్ రావు హుజురాబాద్ వాసుల‌కు మ‌రో బంపరాఫ‌ర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గంలో 5వేల ఇళ్ల‌ను క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చారు. హ‌రీష్ రావు మాట్లాడుతూ…ఆస్తులు కాపాడుకోవడానికే ఈటెల రాజేందర్ రాజీనామా చేసిండని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా..? బీజేపీ పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా..? ఆలోచించాల‌ని అన్నారు.

harish rao | హరీష్ రావు

మాయమాటలు మొసలి కన్నీళ్లు కార్చే వాళ్ళు కావాలా..? నీతి నిజాయితీ తో పనిచేసే వారు కావాలా..? అంటూ హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే 5000 డబుల్ బెడ్రూమ్ లు కట్టిస్తా….మాటిస్తున్నా..అంటూ హ‌రీష్ రావు హామీ ఇచ్చారు. ఈటెల రాజేందర్ మాయమాటలు నమ్మొద్దంటూ హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండ‌గా హుజురాబాద్ లో ఇప్ప‌టికే ద‌ళితుల కోసం ద‌ళిత‌బంధును పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version