కేసీఆర్ తో పెట్టుకుంటే తడాఖా చూపిస్తాం…

-

టి- కాంగ్రెస్ నేతల భవిష్యత్ అమరావతిలో …

మహాకూటమిని లక్ష్యంగా చేసుకుని తెరాస నేత హరీశ్ రావు మాటల తూటాలను పేల్చారు. తెలంగాణలో తెరాసను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్ పార్టీ  తెదేపాతో నీతి మాలిన జత కట్టిందన్నారు. గజ్వేల్ లో జరిగిన కార్యక్రమంలో హరీశ్ మాట్లాడుతూ…ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకి తెలంగాణలో ఏం పని? తెరాసను ఓడించాలని కుట్రలు చేస్తున్న చంద్రబాబు ఖబడ్దార్…కేసీఆర్ ఒక్క దెబ్బకొడితేనే అమరావతిలో పడ్డావ్ … ఇంకా బుద్ధిరాలేదు, కేసీఆర్ తో పెట్టుకుంటే తడాఖా చూపిస్తాం.. అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల భవిష్యత్ అమరావతిలో ఉన్న చంద్రబాబబు నాయుడి చేతిలో ఉందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే చంద్రబాబుని ప్రచారానికి తీసుకురండీ అంటూ ఛాలెంజ్ విసిరారు. మన సీట్లను మనం పంచుకుని మన ప్రభుత్వాన్ని మనం పాలించుకుందామని తెలంగాణ తెచ్చుకుంటే… అటు ఢిల్లీ రాహుల్ గాంధీ.. ఇటు ఏపీలో చంద్రబాబు స్క్రిప్టు రడీ చేస్తున్నారని విమర్శించారు. డబ్బులను పంచడం దగ్గర నుంచి నాయకులు ఏం మాట్లాడాలో అనే విషయాన్ని మొత్తం అమరావతి నుంచే డైరెక్ట్ చేయడం మరింత దారణమన్నారు. నువ్వెన్ని ఎత్తులు వేసిన కేసీఆర్ ని ఏమీ చేయలేవు…ఒక్క సారి కేసీఆర్ నీ గురించి ఆలోచించడం మొదలు పెడితే…నీ సంగతి ఏమైతదో తెలుసుకో అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version