హర్ష సాయి దేశం విడిచి పారిపోయాడు.. అడ్వకేట్ నాగుర్ బాబు

-

యూట్యూబ్ స్టార్ హర్షసాయి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇటీవలే అతని పై ఓ యువతి తనను మోసం చేశాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అడ్వకేట్ నాగుర్ బాబు సంచలన విషయాలను మీడియాకు వెల్లడించారు.  మెగా సినిమా రైట్స్ కోసం ఆ  బాధితురాలిపై అఘాయిత్యం చేసాడు. తన పీఆర్ టీమ్ తో ఇక్కడ అందరిని మేనేజ్ చేస్తున్నాడు. హర్ష సాయి బెట్టింగ్ మాఫియా బయటకు తెచ్చాము. మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బాధితురాలు ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.

హర్ష సాయి కొన్ని అడియోలు , వీడియో లను సోషల్ మీడియా ద్వారా రీలీజ్ చేసి బాధితురాలును ఇబ్బందికి గురి చేస్తున్నారు. హైకోర్టు అలాంటి వాటిపై సీరియస్ కావడం జరిగింది. వెంటనే సోషల్ మీడియా లో ఉన్న పోస్టులు, క్లిపింగ్స్ తీసివేయాలని హైకోర్టు ప్రభుత్వం కు ఆదేశాలు ఇచ్చింది. బాధితురాలు పేరును ప్రస్తావిస్తూ కొన్ని సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. హర్ష సాయి తండ్రి పేరు FIR లో లేకపోయిన హైకోర్టు లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. హైకోర్టు వారి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. బాలాచాంధర్ మెగా సినిమా కో ప్రొడ్యూసర్..ఒక మహిళా ధైర్యంగా బయటకు వచ్చి కేసు పెట్టింది. మెగా సినిమా లో ఒక సాంగ్ కోసం వీళ్ళు పరిచయం అయ్యారు. శ్రీ పిచ్చర్స్ ద్వారా ఒక పాట కోసం కలిశారు.  సినిమా తీద్దాం అని హర్ష సాయి బాధితురాలిని అప్రోచ్ అయ్యాడని వెల్లడించారు అడ్వకేట్ నాగుర్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news