అక్షర్ పటేల్ ను వరల్డ్ కప్ నుండి కావాలనే తప్పించారా ?

-

నిన్న సాయంత్రం బీసీసీఐ నుండి ఒక పిడుగులాంటి వార్త వచ్చి అక్షర్ పటేల్ నెత్తిమీద పడింది. ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో చేతికి గాయం కావడంతో హఠాత్తుగా ఆసియా కప్ ఫైనల్ కు మరియు వరల్డ్ కప్ జట్టులోనూ డౌట్ లో పెట్టింది టీం ఇండియా యాజమాన్యం. అయితే అక్షర్ పటేల్ కు బదులుగా మరో స్పిన్నర్ అల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటూ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కానీ టీం ఇండియా యాజమాన్యం అక్షర్ పటేల్ కు గాయం గురించి ఇంకా క్లారిటీ రాలేదు, అందుకే అతని స్థానంలో అశ్విన్ ను తీసుకున్నాం అంటూ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల అనంతరం అక్షర్ పటేల్ ఒక పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ ను బట్టి చూస్తే అక్షర్ పటేల్ ను కావాలనే తీసివేశారన్నది స్పష్టంగా అర్ధమవుతోంది. మరి అక్షర్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన అశ్విన్ మెరుగ్గా రాణించి ఇండియాకు వరల్డ్ కప్ ను అందిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news