లక్షద్వీప్ లో HDFC మొదటి బ్రాంచ్..!

-

దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లక్షద్వీప్ లో కవరత్తి ద్వీపంలో కొత్తగా ఒక బ్రాంచ్ ని ఏర్పాటు చేసింది. దీనితో కేంద్ర పాలిత ప్రాంతంలో ఏర్పాటు అయినా మొదటి ప్రైవేట్ రంగ బ్యాంకు గా ఇది నిలిచింది. ప్రజలు వ్యాపారులు టూరిస్ట్ ల అవసరాలను తీర్చడానికి ఇక్కడ బ్యాంక్ ని ప్రారంభించినట్లు బ్యాంక్ రిటైల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ ఎస్ సంపత్ కుమార్ చెప్పారు.

ఇటీవల భారత్ మాల్దీవుల మధ్య వివాదం తలెత్తును నేపథ్యంలో లక్షద్వీప్ ని టూరిస్ట్ హబ్ గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుంది. ఈ తరుణంలో బ్యాంకింగ్ సేవలు అందించాలని మిగతా ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ముందు HDFC తన బ్రాంచ్ ని ఏర్పాటు చేయడం విశేషం ప్రస్తుతం లక్షద్వీప్ లో టూరిస్టుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version