భారత్‌ జోడో యాత్ర ఎఫెక్ట్.. హైదరాబాద్ శివారులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

-

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర హైదరాబాద్ మహానగరంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఇవాళ సాయంత్రం లింగంపల్లి చౌరస్తా నుంచి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్‌ ప్రయాణిస్తోంది. ఓ వైపు రాహుల్ కాన్వాయ్ ప్రయాణిస్తుండగా.. మరోవైపు సాధారణ వాహనాలను దారి మళ్లించి వన్‌వేలో రెండు వైపులా వెళ్లే విధంగా ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక్రిశాట్‌ దాటిన తర్వాత సాయంత్ర వేళ బాలుడితో రాహుల్‌ గాంధీ క్రికెట్‌ ఆడారు. ఆ సందర్భంలో కొంత సమయం ట్రాఫిక్‌ ఆగింది.

అనంతరం పటాన్‌చెరు ఆనంద్‌భవన్‌ హోటల్లో 20 నిమిషాల పాటు రాహుల్‌ సేద తీరారు. అప్పుడు కూడా కార్యకర్తల రద్దీతో రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత రాహుల్‌ గాంధీ యాత్ర మొదలు పెట్టినప్పటికీ రహదారికి రెండు వైపులా రద్దీ కొనసాగింది. అనంతరం ముత్తంగిలో రాహుల్‌ కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించడంతో ముత్తంగి నుంచి పటాన్‌చెరు వైపు దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు. సాయంత్రం పూట ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న వారంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version