650కిమీ హైదరాబాద్ టూ చెన్నై బైక్ పై సింగిల్ గా హీరో అజిత్ రైడ్…!

-

లాక్ డౌన్ దెబ్బకు ఇప్పుడు ఒక్క సినిమా కూడా షూటింగ్ జరిగే అవకాశం అనేది ఎక్కడా కనపడటం లేదు. సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా షూటింగ్ ని ఆపేశారు. ఏ ఒక్క సినిమాను ఇప్పట్లో మొదలు పెట్టే అవకాశాలు కనపడటం లేదు. దీనితో హీరోలు, నటులు అందరూ కూడా తమ ఇంటికే పరిమతం అవుతూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్నారు. ఈ తరుణంలో తమిళ స్టార్ హీరో అజిత్ బైక్ మీద ఏకంగా 650 కిలోమీటర్లు రైడ్ చేయడం గమనార్హం. హైదరాబాద్ నుంచి అతను చెన్నై బైక్ మీద వెళ్ళిపోయాడు. అజిత్ హెచ్ వినోద్ దర్శకత్వంలో వాలిమై సినిమా చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ బైక్ ను తాయారు చేసింది చిత్ర యూనిట్.

దీనిపై కొన్ని చేజింగ్ సీన్స్ ని షూట్ కూడా చేసారు. బైక్ బాగా నచ్చడంతో అజిత్ హైదరాబాద్ నుంచి చెన్నైకి 650 కిలోమీటర్లు అదే బైక్ మీద ప్రయాణం చేసి వెళ్ళాడు అజిత్. కేవలం పెట్రోల్, ఫుడ్ కోసమే మధ్యలో ఆగినట్టు తెలిపారు. అతను రైడ్ సూట్ లో చెన్నై వరకు ప్రయాణం చేసాడు. భద్రతా సిబ్బంది ఎవరు లేకుండా అతను చెన్నై వెళ్ళడం గమనార్హం. ఈ వీడియో విస్తృతంగా వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version