హీరో బాలకృష్ణకు, నాకు పరస్పర గౌరవం ఉంది : అంజలి

-

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను రూపొందించాడు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా అంజలి ముఖ్య పాత్రలో నటించింది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు .ఈ ఈవెంట్ కు నట సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ తనను తోసేసిన ఘటనపై హీరోయిన్ అంజలి మరోసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ స్టేజీ మీద ఏం జరిగిందనే విషయం మాకు మాత్రమే తెలుసు. కొద్దిగా జరగాలంటూ బాలయ్య నెట్టారు. నేను వెంటనే నవ్వేశా. చాలా చిన్న సంఘటనపై సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం చేశారు’ అని పేర్కొన్నారు. బాలకృష్ణకు, తనకు పరస్పర గౌరవం ఉందని ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news