ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పార్టీదే అధికారం.. తేల్చి చెప్పిన ఇండియా టుడే

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలుపడ్డాయి.ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కొన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నాయకత్వంలోని కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని ప్రకటించగా మరికొన్ని సర్వేలు వైసిపి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమే అధికారం చేపడుతుందని India Today Axis My India తేల్చింది.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 98-120 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. 175 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ : 78-96, జనసేన 16-18, బీజేపీ: 4-6, వైసీపీ: 55-77, కాంగ్రెస్: 0-2 సీట్లను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే… ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారిక ఫలితాలు జూన్ 4వ తేదీన వెలుపడతాయి. మరి ఈ ఎన్నికలలో ఎవరు అధికారం లోకి వస్తారు అని తెలియాలంటే ఎల్లుండి వరకు వేచి చూడాల్సిందే మరి.

Read more RELATED
Recommended to you

Latest news