“సినిమా స్క్రీనింగ్ కోసం లంచం” స్టార్ హీరో సంచలనం

-

గత వారమే విశాల్ మరియు ఎస్ జె సూర్యలు మాస్ పాత్రలలో నటించిన మార్క్ ఆంథోనీ మూవీ తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో హీరో విశాల్ సంచలన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టడం మూవీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశం అయింది. కాసేపటి క్రితమే మార్క్ ఆంథోనీ లో హీరోగా చేసిన విశాల్ సోషల్ మీడియాలో, మార్క్ ఆంథోనీ హిందీ వెర్షన్ రిలీజ్ చేయడానికి లంచం చెల్లించినట్లుగా మెసేజ్ చేశాడు. ముంబై లోనే సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫీస్ లో అస్సకలు పరిస్థితి బాలేదని.. సినిమాను స్క్రీనింగ్ కోసం రూ. 3 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ. 3 .5 లక్షలు లంచంగా చెల్లిచాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. ఒక వీడియో ను పీఎం మరియు మహరాష్ట్ర సీఎం ల దృష్టికి తీసుకు వెళ్తాను అన్నట్లు వీడియో ను పోస్ట్ చేయడం విశేషం.

కానీ ఇది ఇక్కడ మాత్రమే కాదు.. చాలా చోట్ల కామన్ గా ఉంటుంది. అందరూ బయట పెట్టుకునే సాహసం చేయరు. మరి ఈ వీడియో పై పీఎం మరియు మహారాష్ట్ర సీఎం ఏమైనా స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news