ఓయూ హాస్టళ్ళలో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశం

-

ఓయూ హాస్టల్ విద్యార్థుల పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల రెండవ తేదీ నుంచి హాస్టల్ లో విద్యుత్, నీటి సరఫరా తొలగించడంతో విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈనెల 26 వరకు సెలవులు పొడిగించారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈనెల 27వ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు ఉన్నాయని.. హాస్టల్లో మూసివేయడం వల్ల దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. పిటీషనర్ల వాదనలో విన్న న్యాయస్థానం ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ లో విద్యుత్, నీటి సరఫరాని తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించింది. ఒకవేళ హాస్టల్ లో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించకపోతే రేపు రిజిస్ట్రార్ హైకోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version