రాజాసింగ్ కేసులో కౌంటర్ దాఖలే ఏది.. ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్ అయింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​పై నమోదైన పీడీ యాక్ట్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. రాజాసింగ్‌పై నమోదైన కేసులో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీడీ యాక్ట్ పెట్టడానికి కారణం చెప్పాలని మరోసారి సర్కారును ధర్మాసనం ఆదేశించింది. వచ్చే విచారణలోగా కౌంటర్ దాఖలు చేయకపోతే ఆర్డర్ ఇస్తామని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.

ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రాజాసింగ్​పై హైదరాబాద్​ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. మంగళహాట్ పోలీస్​స్టేషన్ పరిధిలో రాజాసింగ్​పై రౌడీషీట్ తెరిచారు. రాజాసింగ్ తరుచూ​ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఘర్షణలు చోటుచేసుకునేలా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్​ పోలీస్ కమిషనర్​ సీవీ ఆనంద్​ తెలిపారు.

ఓ వర్గాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేసిన వీడియో శాంతిభద్రలకు విఘాతం కలిగించిందని హైదరాబాద్ సీపీ సీవీ అనంద్ పేర్కొన్నారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్​పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. 18 కమ్యూనల్ కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version