ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: నందమూరి బాలకృష్ణ

-

తెలుగు ప్రజలకు టాలీవుడ్ హీరో , హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోమవారం ప్రకటన రిలీజ్ చేశారు.”తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలి అని ,నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కల్పించాలి అని ఆకాంక్షించారు. మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉండాలి. తెలుగువారి అస్తిత్వానికి చిరునామాగా నిలిచే వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి సాధించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి జీవితం వసంత రుతువులో చిరుగులా చిగురించాలి” అని నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news