విడాకులకు అప్లయ్‌ చేసిన ధనుష్‌ – ఐశ్వర్య

-

తమిళ నటుడు ధనుష్‌, రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు విషయం తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నామంటూ రెండేళ్ల క్రితం ఈ ఇద్దరు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అప్పటి నుంచి వారిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. అయితే తాజాగా వీరిద్దరూ విడాకులకు అప్లయ్‌ చేసినట్లు సమాచారం. చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్‌ కోర్టును సంప్రదించి.. మ్యూచువల్ కన్సెంట్ కింద విడాకులు కోరినట్లు పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు వచ్చాయి. దీనిపై ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

మొదట ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అంగీకారంతో 2004 నవంబర్‌ 18న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని 2022లో అనౌన్స్‌ చేశారు. ‘‘18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేనూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం’’ అని ధనుష్‌ పోస్ట్‌ పెట్టారు. ఇదే పోస్టును ఐశ్వర్య కూడా షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news