టీఆర్ఎస్ భవన్ వద్ద నేతల ఆందోళన.. చచ్చిపోవాలా ?

-

టీఆర్ఎస్ భవన్ కు అసమ్మతి సెగ తగిలింది.  ఉద్యమకారులకు టీఆర్ఎస్ లో అన్యాయం జరిగిందని తెలంగాణ భవన్ ఎదుట పలువురు టీఆర్ఎస్ అసమ్మతికారులు నిరసనకు దిగారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉద్యమ కారులకు టికెట్ లు ఇవ్వకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డాడని, మొదటి నుంచి టీఆర్ఎస్ లో వున్న మేము ఇప్పుడు చచ్చిపోవాలా ? అని ప్రశ్నిస్తూ వారు నిరసనకు దిగారు. కేసీఆర్, కేటిఆర్ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ కు చెందిన టీఆర్ఎస్ నేత అంకెనపల్లి మల్లేష్ యాదవ్ అనుచరులతో కలిసి ఈ ధర్నా చేస్తున్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తనకు టికెట్ రాకుండా  ఎమ్మెల్యే అడ్డుకున్నారని ఆరోప్సితున్నారు. మరి ఈ విషయం మీద టీఆర్ఎస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.  

Read more RELATED
Recommended to you

Latest news