టీఆర్ఎస్ చివరి జాబితా విడుదల.. 26 మంది సిట్టింగ్ లకు నో ఛాన్స్

-

జిహెచ్ఎంసి లో పోటీ చేసే కార్పోరేటర్ అభ్యర్థులకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. మొత్తం 25 మంది అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేశారు. మొత్తం 26 మంది సిట్టింగ్ కార్పొరేటర్ కి ఛాన్స్ దక్కలేదు. మూడవ జాబితాలో 16 మంది సిట్టింగ్ లకు సీటు దక్కలేదు. ఇక మొత్తం 150 డివిజన్ లకు అభ్యర్థులను టిఆర్ఎస్ ప్రకటించారు. ఇక ఏఎస్ రావు నగర్ పి పావని రెడ్డి, చెర్లపల్లి బొంతు శ్రీదేవి యాదవ్, మీర్పేట్ హెచ్.బి.కాలనీ ప్రభుదాస్, నాచరం – సైజన్ శేఖర్,  చిల్కానగర్ ప్రవీణ్ ముదిరాజ్.

హబ్సిగూడ బేతి స్వప్నా రెడ్డి, ఉప్పల్ భాస్కర్, అత్తాపూర్ మాధవి, కాచిగూడ – డాక్టర్ శిరీష, నల్లకుంట శ్రీదేవి, అంబర్‌పేట్ విజయ కుమార్ గౌడ్ , ఆదిక్మెత్ హేమలత రెడ్డి, ముషీరాబాద్ ఎట్లా భాగ్యలక్ష్మి యాదవ్,  కవాడిగూడ లాస్య నందిత, యూసుఫ్‌గుడా రాజ్ కుమార్ పటేల్, వెంగల్ రావు నగర్ దేదీప్యరావు, రహమత్ నగర్ సిఎన్ రెడ్డి,  నెరెడ్‌మెట్ మీనా ఉపేందర్ రెడ్డి, తూర్పు ఆనంద్ బాగ్ వై ప్రేమ్ కుమార్,  గౌతమ్ నగర్ మేకల సునీత రాము యాదవ్, గోల్నాక దూసరి లావణ్య , చందానగర్ మంజుల రఘునాథ్ రెడ్డి  , హైదర్ నగర్ నార్నె శ్రీనివాస్ రావు ,  తార్నాక మోతే శ్రీలత , మౌలాలి ముంతాజ్ ఫాతిమా లను చివరి జాబితాలో రిలీజ్ చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news