ఇక్రిశాట్ కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా హిమాన్షు

-

ఇక్రిశాట్ నూతన డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్ హిమాన్షు పాఠక్‌ నియామకం అయ్యారు. వ్యవసాయ పరిశోధన, విద్యా‌శాఖ కార్యదర్శిగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా ఆయన పనిచేశారు.ఇక్రిశాట్‌ ఆవిర్భావం తర్వాత డీజీగా నియమితులైన తొలి ఇండియన్‌గా హిమాన్షు పాఠక్‌ చరిత్ర సృష్టించారు.భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ న్యూఢిల్లీ నుంచి సాయిల్ సైన్స్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ పూర్తి చేశారు.

వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయంలో బీఎస్సీ పూర్తి చేసిన ఆయన దేశంలోని పలు ఐసీఆర్‌ఏ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 1994లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ యంగ్ సైంటిస్ట్ అవార్డును సైతం అందుకున్నారు. 1998లో ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ గోల్డెన్ జూబ్లీ యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు. 2001లో ISCA డాక్టర్ బీసీ డెబ్ మెమోరియల్ అవార్డును గెలుచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news