మెదక్‌లో దారుణం..నిద్రిస్తున్న మహిళపై ఇంటి ఓనర్‌ లైంగిక దాడి !

-

మన దేశంలో రోజు రోజు దారుణాలు అంతకంతకు పెరిగి పోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే మరొకరు అండగా నిలవాల్సిన బంధువులే అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనాలను తీసుకువచ్చినా.. ఈ లైంగిక దాడులు ఆగడం లేదు.

ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ లో కిరాయి ఉంటున్న మహిళపై లైంగిక దాడి చేసే ప్రయత్నం చేశాడు. మెదక్ పాపన్నపేటలో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం చేశాడు ఇంటి ఓనర్‌ కొడుకు. రాత్రి పిల్లలతో కలిసి ఇంట్లో పడుకున్న మహిళ.. భర్త డాబా పైన పడుకున్నాడని తలుపులు తీసి పడుకుంది. అయితే.. అర్థరాత్రి ఇంటి యజమాని కొడుకు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.
మహిళ కేకలు వేయడంతో పారిపోయాడు ఇంటి ఓనర్ కొడుకు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version