హనీమూన్ వెళ్లాలనుకుంటున్నారా…? అయితే షిమ్లా, కులు మనాలి ప్యాకేజీ వివరాలను చూడాల్సిందే..!

-

మీరు హనీమూన్ వెళ్లాలని అనుకుంటున్నారా..? ఏదైనా మంచిగా ప్లాన్ చెయ్యాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ ప్యాకేజీలను చూడండి. హనీమూన్ వెళ్లాలనుకునే వాళ్లకి ఇవి బెస్ట్ ప్యాకేజీలు. ఎక్కువ మంది హనీమూన్ వెళ్లేందుకు కేరళను ఎంపిక చేసుకుంటారు.

కేరళ అందంగా ఉంటుంది. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ కి వెళ్తే చాలా బాగుంటుంది. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మీరు IRCTC తిరువనంతపురం నుండి మీరు ఈ ప్యాకేజీని ఎంపిక చేసుకుని ఎంచక్కా మీ పార్టనర్ తో కలిసి ఎంజాయ్ చెయ్యచ్చు. హిమాలయ పర్యాటక ప్రాంతాలైన షిమ్లా, కులు, మనాలి వెళ్ళచ్చు.

మీరు ముందు కేరళ చూసేసి అక్కడ నుండి విమానంలో హిమాలయ ప్రాంతాలను చూసేయచ్చు. షిమ్లా, కులు, మనాలి ప్రాంతాలను చూసేందుకు చాలా మంది వెళ్తూ వుంటారు. మీరు కూడా వెళ్లి వచ్చేయచ్చు. ఈ టూర్ కి వెళ్లాలనుకుంటే ఒక్కొక్కరికి రూ.66,350 ఖర్చు అవుతుంది.

ఈ ప్యాకేజీ లో మొత్తం 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. నవంబర్ 11, 2022న ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. మీరు ఈ టూర్ వేసేయాలంటే IRCTC యొక్క అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అలానే పూర్తి వివరాలను కూడా చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news