గుడ్ మార్నింగ్ సీఎం జగన్.. గూబ గుయ్యి మందా – నారా లోకేష్

-

సిఎం జగన్ మోహన్ రెడ్డి పై మరోసారి నారా లోకేష్ సెటైర్ వేశారు. గుడ్ మార్నింగ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి… ఈఎన్ సి దెబ్బకి ఉదయాన్నే గూబ గుయ్యిమని ఉంటుందే ? అంటూ చురకలు అంటించారు. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మీ ప్రభుత్వమే ప్రకటించడం దేవుడి స్క్రిప్ట్! అని ట్వీట్ చేశారు నారా లోకేష్.

దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసిన మీరు ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడటం సెల్ఫ్ గోల్ వేసుకోవడమే అని అమండిపడ్డారు. ఇప్పటికైనా ఏపీని డెవలప్ చేయండని కోరారు. ఇక మరో ట్వీట్ లో జెండా ఊపి ఊరేగించిన అంబులెన్సులు ఏమయ్యాయి సీఎం గారూ? పాముకాటుకు చనిపోయిన తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం దిగువ పుత్తూరుకి చెందిన ఏడేళ్ల తన కొడుకు బసవయ్య మృతదేహాన్ని ఆ తండ్రి బండిపై తీసుకెళ్లిన హృదయవిదారక దృశ్యం మీ అమానవీయ పాలనకి నిదర్శనం‌. సర్కారు అంబులెన్సులు రావు అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news