విశాఖపట్నంలో హనీ‌ట్రాప్ కేసు.. దూకుడు మరింత పెంచిన పోలీసులు

-

విశాఖపట్నంలోని హనీ‌ట్రాప్ కేసులో పోలీసులు మరింత దూకుడును కొనసాగిస్తున్నారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసు బాధితులు ఎక్కువగా ఉంటారని ఓ అంచనాకు వచ్చారు.ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక హైదరాబాద్ కేంద్రంగా ఈ హనీ ట్రాప్ ముఠా నెట్‌వర్క్ నడుస్తోందని సమాచారం. గ్లామర్ అమ్మాయిల ఫొటోలతో పెళ్లికాని యువకులను ఆకర్షిస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా అమాయకులను వారి బుట్టలో వేసుకుంటున్నారు. ఆ తర్వాత బాధితులకు మత్తు పదార్థాలు అలవాటు చేసి వారు మత్తులోకి జారుకున్నాక యువతులు సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు తీస్తారు. అనంతరం ఆ ఫొటోలను బాధితులకు చూపించి డబ్బులు వసూలు చేస్తారు.ఫొటోలు బయటకు వస్తే పరువుపోతుందన్న భయంతో బాధితులు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు సమర్పించుకుంటున్నారు. ఈ హనీ ట్రాప్‌లో చాలా మంది యువత ఇరుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.దీంతో నిందితుల లావాదేవీలపై పోలీసులు నిఘా పెట్టారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version