మనల్ని భయపెట్టాలని చూస్తున్న జగన్ ఎంత, జగన్ బ్రతుకెంత : జనసేనాని

-

అణగారిన వర్గాలపై దాడులు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అని వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అణగారిన వర్గాలకు అండగా నిలబడుతుంది కూటమి ప్రభుత్వం అని అన్నారు జనసేనాని.మనమేం తప్పు చేయలేదు, జాతీయ నాయకులు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు పుట్టిన నేల దివిసీమ, మనల్ని భయపెట్టాలని చూస్తున్న జగన్ ఎంత, జగన్ బ్రతుకెంత, వారి ఎమ్మెల్యే ల బ్రతుకెంత అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవనిగడ్డలో ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి, టూరిజం అభివృద్ది చేస్తాం, అవనిగడ్డ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతాం అని హామీ ఇచ్చారు.నాగాయలంక వద్ద DRDO వారు మిస్సైల్ లాంచింగ్ సెంటర్ 33వేల కోట్లతో పెట్టడానికి సిద్దంగా ఉండి, భూ సేకరణ కూడా చేసారు, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాని ఊసు లేదు, అది వచ్చి ఉంటే ఇక్కడ ఎంతో ఉపాధి, వ్యాపారం , భూమి రేట్లు పెరుగుతాయి అని అన్నారు.తెలుగును అధికారిక భాష చేసిన మహనీయుడు దళిత సీఎం దామోదరం సంజీవయ్య.గబ్బిలం, ఫిరదౌసి లాంటి గొప్ప రచనలు చేసిన వ్యక్తి దళిత వర్గానికి చెందిన విశ్వనరుడు జాషువా. అలాంటి వారు లండన్ లో చదువుకోలేదు, ఇక్కడ మాతృ భాషలో చదువుకున్నారు అని గుర్తు చేశారు. ఇంగ్లీష్ అవసరమే, కానీ మాతృ భాష కూడా ఉండాలి అనేది మా ఆలోచన అని జనసేనాని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news