పెద్ద సినిమాలకు షాక్ ఇస్తున్న.. “అసలేం జరిగింది ?”

-

కోలీవుడ్ స్టార్ హీరో శ్రీరామ్.. గురించి స్పెషల్ గా చెప్పనక్కరలేదు. రోజా పూలు, ఒకరికొకరు లాంటి సినిమాల్లో నటించి… తెలుగు ప్రేక్షకులను సైతం గుర్తించాడు హీరో శ్రీరామ్. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ… తనదైన నటనతో.. అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే తెలుగులో… ఎక్కువగా సపోర్టింగ్ రూల్స్ చేస్తున్నాడు హీరో శ్రీరామ్.

ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత మరోసారి… తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో శ్రీరామ్. “అసలేం జరిగింది ?” అనే డిఫరెంట్ మూవీతో…. వచ్చాడు హీరో శ్రీ రామ్. ఈ సినిమాకు ఎం.వి.ఆర్ దర్శకత్వం వహించగా… మైనేని నీలిమ చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడలు .. ఎక్స్ డోస్ మీడియా బ్యానర్ పై నిర్మించారు. అయితే… కరోనా నేపథ్యంలో… చిన్న సినిమాలను ఎక్కువ శాతం ఓటిటీ లోనే విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

అయితే అసలేం జరిగింది ? సినిమా చిన్నదైనప్పటికీ… నిర్మాతలు చాలా ధైర్యం చేసి… థియేటర్ లోనే విడుదల చేశారు. దీనికి ముఖ్య కారణం ఈ సినిమా కథ బలంగా ఉండటం. అక్టోబర్ 22వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా, అండమాన్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అసలేం జరిగింది ? సినిమా… పూర్తిగా సస్పెన్స్ త్రిల్లర్ మరియు లవ్ స్టోరీ కథాంశంగా తెరకెక్కింది.

దీంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇంకేముంది థియేటర్లో.. గత మూడు వారాల నుంచి విజయవంతంగా నడుస్తుంది అసలేం జరిగింది ? సినిమా. ఎవరూ ఊహించని రీతిలో  వసూళ్లను కూడా రాబడుతోంది అసలేం జరిగింది ? సినిమా. ఎంతలా అంటే… స్టార్ హీరోల మూవీలకు కూడా ఈ గట్టి పోటీ ఇచ్చింది.

దీపావళి పండుగ కానుకగా విడుదలైన… పెద్దన్న, మంచిరోజులు వచ్చాయి కంటే అస‌లేం జ‌రిగింది? వ‌సూళ్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స‌మాచారం. గ‌త ఆదివారం నుంచి బుధ‌వారం దాకా న‌గ‌రంలోని ప‌లు థియేట‌ర్ల‌లో ఈ సినిమా అధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. అంతేకాదు, రెండు మూడు వారాల్లో ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల‌య్యే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలిసింది. ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ ఈ సినిమాను మంచి రేటుకు కొనుగోలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. మొత్తానికి 2021లో చిన్న సినిమా అయినా మంచి హిట్ టాక్ కొట్టిన సినిమాల్లో అస‌లేం జ‌రిగింది? నిలిచింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news