భార్యని కొడవలితో నరికి హత్య చేసిన భర్త..!

-

అవుకులో భార్యను నరికి చంపిన హత్య ఘటన లో ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. భార్య కుమారి (35)ని కొడవలి తో నరికి హత్య చేసిన భర్త రంగస్వామి. అలానే అత్త సుబ్బ లక్ష్మమ్మ పైన కొడవలి తో దాడి చేసాడు. హత్యకు కొన్ని గంటల ముందు పోలీసులను ఆశ్రయించారు కుమారి, సుబ్బ లక్ష్మమ్మ.

భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు అవుకు పీఎస్ కు కుమారి, సుబ్బలక్ష్మమ్మ వెళ్లారు. ఎస్ ఐ లేరని సిబ్బంది వెనక్కి పంపడంతో పుట్టింటికి వెళ్లేందుకు బస్ స్టాండ్ కి కుమారి, సుబ్బలక్ష్మమ్మ వెళ్లారు. స్టేషన్ కు వెళ్లారని సమాచారం తెలిసి బస్ స్టాండ్ కి తాగొచ్చి కొడవలితో రంగస్వామి భార్యని నరికేశాడు. పోలీసులు స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని బంధువుల అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version