హుజురాబాద్ లో గెలిచే అభ్యర్థికి ఈసీ బిగ్ షాక్…!

-

హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాజాగా ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. సాయంత్రం లోగా ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే తాజాగా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీకి మరియు అభ్యర్థికి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ఆదేశాలు జారీ చేశారు.

దీనిపై ఎన్నికల సంఘం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని వెల్లడించారు. ఉత్తర్వులను అధికారులు పగడ్బందీగా అమలు చేయాలని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శశాంక్ గోయల్ ఈరోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉంటే గెలిచిన తర్వాత సంబరాల్లో మునిగితేలాలి అనుకున్న అభ్యర్థులకు తమ నిర్ణయంతో ఈసీ షాక్ ఇచ్చింది. దాంతో విజయోత్సవ ర్యాలీని గెలిచిన పార్టీలు వాయిదా వేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news