భర్త ఉండగానే వితంతు ఫించన్..అత్త ఎంట్రీ తో షాక్..!

-

ఓ మహిళ ఫించన్ కోసం బతికున్న భర్తనే రికార్డుల్లో చంపేసింది. అయితే కుటుంబం లో కలహాలు రావడం తో అత్త ఎంట్రీ ఇచ్చి అసలు విషయం భయట పెట్టింది. దాంతో అధికారుల పని తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని జగద్గి రి గుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. దివ్య అనే మహిళ తన భర్త సుభాష్ తో కలిసి ధరణి నగర్ లో నివాసం ఉంటోంది.

అయితే భర్త హ్యాపీ గా తిరుగుతున్నా కూడా తనకు భర్త లేడని అధికారులను నమ్మించి ఫించన్ పొందుతోంది. కాగా ఇటీవల కుటుంబాలలో గొడవలు జరిగాయి. దాంతో అత్త తన కొడుకు బతికే ఉన్నాడని..ఫించన్ కోసం కోడలు చనిపోయాడని చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కోడలు ఫించన్ కోసం భర్త ను చంపడానికి కూడా వెనకడుగు వేయదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన పై భర్త కూడా అధికారుల మీదకు ఫైర్ అయ్యారు. ఇక విషయం తెలుసుకున్న అధికారులు షాక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news