విజృంభించిన హైద‌రాబాద్‌.. పంజాబ్ టార్గెట్ 202..

-

దుబాయ్‌లో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 22వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ భారీ స్కోరు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైద‌రాబాద్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 201 ప‌రుగుల భారీ స్కోరు చేసింది.

హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్ల‌లో ఓపెన‌ర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్న‌ర్‌లు అద్భుతంగా రాణించారు. మొద‌టి వికెట్ కు వారు ఏకంగా 160 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని జోడించారు. జానీ బెయిర్‌స్టో 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 97 ప‌రుగులు చేయ‌గా, వార్న‌ర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 52 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ జ‌ట్టు భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. ఇక పంజాబ్ బౌలర్ల‌లో ర‌వి బిష్ణోయ్ 3 వికెట్లు తీయ‌గా, అర్ష‌దీప్ సింగ్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ష‌మీకి 1 వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version