ఈనెల 23న మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ నియోజకవర్గ ఓటర్ల జాబితా విడుదల

-

మహబూబ్​నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితా అనుబంధాన్ని ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం డిసెంబర్ 31న ప్రకటించిన జాబితా ప్రకారం 29,501 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరాలు, వినతుల గడువు ముగిసిందని చెప్పారు. గడవులోపు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి 23న అనుబంధ జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలను త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో హైదరాబాద్, మేడ్చెల్ , రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని.. రాజకీయపార్టీలు, అభ్యర్థులకు అన్ని నిబంధనలు వర్తిస్తాయని వికాస్‌ రాజ్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version