IPL 2023 : మ్యాచ్ కు వెళ్లే వారికి హైదరాబాద్‌ మెట్రో శుభవార్త..ఇవాళ ఎక్కువ సర్వీసులు

-

ఉప్పల్ మ్యాచ్ కు వెళ్లే వారికి హైదరాబాద్‌ మెట్రో శుభవార్త. 3 ఏళ్ల తర్వాత ఇవాళ హైదరాబాద్‌ లో SRH మ్యాచ్‌ జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మరియు రాజస్థాన్‌ జట్ల మధ్య నాలుగో మ్యాచ్‌ జరుగనుంది. ఈ తరుణంలో ఉప్పల్‌ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, క్రికెట్‌ అభిమానుల కోసం ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది.

ఆదివారం జరిగే మ్యాచ్‌ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపింది ప్రభుత్వం. ఇవాళ మద్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎక్కువ రైళ్లు నడుపుతామని ప్రకటించారు హైదరాబాద్‌ మెట్రో అధికారులు. రద్దీ కారణంగా నాగోల్‌-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు. మరో వైపు ఉప్పల్‌ మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ ముగిసాయి. ఇంకో వైపు ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news