హైదరాబాద్ నుండి ఊటీ టూర్.. సరదాగా ఈ ప్రదేశాలన్నీ చూసి రావచ్చు..!

-

చాలా మంది వేసవి లో మంచి టూర్ వెయ్యాలని అనుకుంటూ వుంటారు. మీరు కూడా వేసవిలో ఏదైనా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. వేసవి సెలవులు ముగిసేలోగా ఊటీ టూర్ వెయ్యాలని వుందా..? అయితే ఈ ప్యాకేజీని చూడాల్సిందే. హైదరాబాద్ నుంచి ఊటీకి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. అల్టిమేట్ ఊటీ పేరు తో ఈ టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. కేవలం రూ.12 వేలకే 5 రోజుల టూర్ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. అల్టిమేట్ ఊటీ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 రోజుల పాటు ఉంటుంది.

ఊటీ, కూనూర్‌ లోని పర్యాటక ప్రాంతాలు చూసి వచ్చేయచ్చు. ప్రతీ మంగళవారం సికింద్రాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీని బుక్ చేస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. తరవాత ఊటీకి బయల్దేరాలి. ఊటీ లోకల్ టూర్ ఉంటుంది. బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ చూసి రావచ్చు. రాత్రికి ఊటీ లోనే ఉండాలి. మూడో రోజు కూడా సైట్ సీయింగ్ ఉంటుంది. దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ ఇవన్నీ చూసి… రాత్రికి ఊటీ లోనే ఉండాలి.

మూడో రోజు కూడా సైట్ సీయింగ్. దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూడవచ్చు. రాత్రికి ఊటీలోనే బస చేయాలి. ఐదో రోజు ఉదయం ఊటీ నుంచి తిరుగు ప్రయాణం. కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కితే.. ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు పర్యాటకులు సికింద్రాబాద్ వచ్చేస్తారు. ఇక ఈ ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. ఊటీ టూర్ ప్యాకేజీ ధర స్టాండర్డ్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.11,500, ట్విన్ షేరింగ్‌కు రూ.13,580 కట్టాలి. అదే కంఫస్ట్ క్లాస్‌లో చూస్తే ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,960, డబుల్ షేరింగ్‌కు ధర రూ.16,030 చెల్లించాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news