నా రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలన చూడలేదు – చంద్రబాబు

-

నా రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని చూడలేదని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ లో సిబిసిఐడి వికృతచేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని మండిపడ్డారు. సుప్రీం నిబంధనలను కూడా పట్టించుకోకుండా సిబిసిఐడి వ్యవహరిస్తోందన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ అయిన వెంకటేష్, సాంబశివరావు వంటి వారి విషయంలో వ్యవహరించిన తీరు అమానుషమని, సప్పుడు అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు.

టిడిపి మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ.. గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 600 మందిపై కేసులు పెట్టారని అన్నారు. కొందరు సిఐడి పోలీసులు ఎందుకు సైకోల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఇలాంటి పాలనలో బలిపశువులు కావద్దని పోలీసులను కోరుతున్నానని అన్నారు.నా రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలన చూడలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news