జగన్ కి ఫేవర్ గానే మూవీ తీశాను : రామ్ గోపాల్ వర్మ

-

ముఖ్యమంత్రి జగన్ రాజకీయ జీవితం ఆధారంగా టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం నిన్న థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటించగా, తన భార్య వైఎస్ భారతి పాత్రలో మానస నటించారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఫేవర్ గానే ‘వ్యూహం’ సినిమా తీశానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ను జోకర్ గా చూపించలేదని.. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని తెలిపారు. విజయవాడ జయరాం థియేటర్లో చిత్రంలోని నటీనటులు, ప్రేక్షకులతో కలిసి ఆయన వ్యూహం సినిమాను వీక్షించారు. లోకేశ్ నిజజీవితంలో ఎలా ఉంటారో అలాగే మూవీలో చూపించానని తెలిపారు. పార్ట్-2లో టీడీపీ-జనసేన పొత్తులపై స్టోరీ ఉంటుందని వెల్లడించారు.

వైఎస్ మరణం నుంచి మొదలై జగన్ పార్టీ పెట్టడం, సీఎం కావడం వంటి ఘటనలను ఇందులో చూపించారు.ఇక మార్చి 8న ‘శపథం’ రిలీజ్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news