ఇండియా, ఇంగ్లండ్ జట్లకు ఐసీసీ భారీ జరిమానా

-

టీం ఇండియా మరియు ఇంగ్లడ్‌ క్రికెట్‌ జట్లకు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. టీం ఇండియా మరియు ఇంగ్లడ్‌ క్రికెట్‌ జట్లకు భారీ జరిమానా విధించింది ఐసీసీ. నాటింగ్‌ హామ్‌ టెస్ట్‌ లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఇరు జట్లకు ఫైన్‌ వేసింది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ లో 2 పాయింట్ల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ వివరించింది.

ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుదని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది ఐసీసీ. కాగా… నాటింగ్‌ హామ్‌ వేదికగా… టీం ఇండియా మరియు ఇంగ్లడ్‌ క్రికెట్‌ జట్ల మధ్య తొలి టెస్ట్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ టెస్ట్‌ కు తరచు వర్షం అడ్డుగా మారింది. ఈ నేపథ్యంలో… మ్యాచ్‌ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో చివరికి మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ ను డ్రా గా ప్రకటించారు అంపైర్లు. ఇక టీం ఇండియా మరియు ఇంగ్లడ్‌ క్రికెట్‌ జట్ల మధ్య రెండో టెస్ట్‌ ఈ నెల 12న ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news