టీడీపీ నిల‌బ‌డాలంటే.. ఎన్టీఆర్ వార‌సులు రావాల్సిందే : మంత్రి బాలినేని

-

తెలుగు దేశం పార్టీ నిల‌బ‌డాలంటే ఎన్టీఆర్ కుటుంబ స‌భ్య‌లు రావాల‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు. టీడీపీ ని న‌డ‌ప‌డం చంద్ర‌బాబు నాయుడు వ‌ల్ల కాద‌ని అన్నారు. ఆయ‌న టైమ్ అయిపోయింద‌ని అన్నారు. చంద్రబాబు కు అసెంబ్లీ లో క‌ష్టం వ‌స్తే అక్క‌డే ఏడ్చేవాడ‌ని అన్నారు. ఇలా బ‌య‌ట కు వెళ్లి ఏడ్చే వాడు కాద‌ని విమ‌ర్శించారు.

త‌మిళ నాడు లో జయలలిత లాగ ఆయ‌న శ‌ప‌ధం చేశారని అన్నారు. కానీ చంద్ర బాబు జ‌య‌ల‌లిత లాగ ముఖ్య మంత్రి కాలేడ‌ని అన్నారు. చంద్రబాబు ఇక టీడీపీ న‌డ‌ప‌లేడ‌ని విమ‌ర్శించారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల పీఆర్ సీ పైన ముఖ్య మంత్రి జ‌గ‌న్ ప‌రిష్కారం చూపుతాడ‌ని అన్నారు. అలాగే గ‌త ప్ర‌భుత్వంలో నే విద్యుత్తు శాఖ లో దాదాపు రూ. 70 వేల కోట్ల అప్పు చేశారని అన్నారు. అందు వ‌ల్లే ప్ర‌స్తుతం రాష్ట్రం లో క‌రెంటు ఛార్జీలు పెరిగాయ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news