పోస్టాఫీస్‌ లోని ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 5000…!

-

పోస్టాఫీస్ సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీంలో చేరిన వారికి నెలకు రూ.5 వేల వరకు పొందవచ్చు. భారతీయులు ఎవరైనా ఈ స్కీంకు అర్హులని పేర్కొంది. డబ్బు సంపాదించాలని అనుకునే వాళ్లు ఉద్యోగంతో పాటు అదనంగా డబ్బులు సంపాదించాలని అనుకునే వారికి అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక స్కీం పోస్టాఫీస్ లో అందుబాటులో ఉంది. ఇందులో చేరిన వారు ప్రతినెలా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

post ofc
post ofc

‘మంత్లీ ఇన్ కమ్ స్కీం’ అనే ఆప్షన్ తో పోస్టాఫీస్ వినిమోగదారుల ముందుకు వచ్చింది. ఇందులో చేరిన కస్టమర్లు ప్రతి నెలా డబ్బులను అందుకోవచ్చు. ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాతి నెల నుంచి రెగ్యూలర్ గా డబ్బు మీ చేతికి వస్తుంది. పెట్టుబడి పెట్టి నెలకు డబ్బును పొందాలనుకునే వారికి ఈ స్కీం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మంత్లీ ఇన్ కమ్ స్కీంలో జాయింట్ అకౌంట్ కలిగిన వాళ్లు దాదాపుగా రూ.9 లక్షల వరకూ పెట్టుబడి పెట్టుకోవచ్చు. మరీ సింగిల్ అకౌంట్ కలిగిన వారు రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన డబ్బులకు పోస్టాఫీస్ వడ్డీ అందిస్తుంది. దీంతో నెలకు రూ.5000 వరకు పొందవచ్చు.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీంలో చేరిన వారికి 6.6 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ స్కీంలో కస్టమర్లు డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్లయితే నెలకు డబ్బును సంపాదించుకోవచ్చు. కస్టమర్లు ఈ స్కీంలో రూ.4.5 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే వారు సంవత్సరానికి రూ.29,700 పొందవచ్చు. అదే రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే ఏడాదికి రూ.60,000 పొందుతారు. అంటే కస్టమర్లు నెలకు రూ.5000 ను అందుకోవచ్చు అనమాట. ఈ స్కీంలో చేరాలని అనుకునేవారు పాస్ పోర్టు ఫోటోలు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు జత చేయాలిసి ఉంటుంది. కాబట్టి ఎవరైనా డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేసుకొనే వారు ఈ స్కీమ్ ను ఎంచుకొని లబ్ది పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news