కళాతపస్వి మరణించే రోజు ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్ళాగవు..!

-

దిగ్గజ దర్శకుడు నటుడు కళాతపస్వి కే విశ్వనాథ్ గురువారం రోజు తుది శ్వాస విడిచిన విషయం సినీ ఇండస్ట్రీని ఊపిరి పీల్చుకోకుండా చేస్తోంది. ఆయన మరణం నిజంగా విషాదకరం. తన సినిమాలతో ఏకంగా ఆస్కార్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్న కే విశ్వనాథ్ వయోభారంతో 92 సంవత్సరాల వయసులో మరణించడం అభిమానులను మరింత కలవరపెడుతోంది. ఇదిలా ఉండగా కళాతపస్వి కే. విశ్వనాథ్ మరణించే రోజు ఏం జరిగింది అనే విషయం తెలిస్తే మాత్రం కన్నీళ్లు లాగవు..

వయోభారం మీద పడడంతో అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే చివరి శ్వాస వరకు ఆయన సినిమా కోసమే శ్రమించారు. ఎనలేని కీర్తిని సంపాదించుకున్న ఈయన శంకరాభరణం సినిమాతో మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమాను తెరకెక్కించిన రోజే ఆయన శివైక్యం అవడం మరింత బాధాకరం. నిజానికి నిన్న చనిపోయే ముందు ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. కే విశ్వనాథ్ మనసుపెట్టి ఒక పాటను రాస్తూ ఉన్నారు. ఆయన రాయలేని పరిస్థితి ఏర్పడడంతో తన పెద్ద కుమారుడికి తన మాటలతో చెబుతూ పాటను రాయించారు. తర్వాత తన కుమారుడు రాసిన పాటను వింటూనే అలా వాలిపోయారు. వెంటనే కంగారుపడిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సెలబ్రిటీల సందర్శనార్థం ఉంచారు . ఇప్పటికే పవన్ కళ్యాణ్ , సాయికుమార్ , అల్లు అరవింద్ , తనికెళ్ల భరణి వంటి దిగ్గజాలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news