బీజేపీకి ఓటేస్తే మంజీరా న‌దిలో ప‌డేసిన‌ట్టే : కేసిఆర్

-

కేసిఆర్ బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ అక్క‌ర‌కురాని చుట్టం. ఒక్క మెడిక‌ల్ కాలేజీ, న‌వోద‌య కాలేజీ ఇవ్వ‌లేదు అని మండిపడ్డారు.ఈరోజు మెదక్ ,జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా ఇవ్వ‌లేదు. బీజేపీకి ఓటేస్తే మంజీరా న‌దిలో ప‌డేసిన‌ట్టే అది ఎందుకు ప‌నికిరాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

యువ‌కులు పిచ్చిపిచ్చిగా గుడ్డిగా ఓట్లు వేయ‌కుండా ఆలోచించాలి అని కోరారు.తెలంగాణకు న్యాయం జ‌ర‌గ‌లాంటే, హ‌క్కులు కాపాడాలంటే, ప్రాజెక్టులు పూర్తి కావాలంటే, రైతాంగానికి మ‌ళ్లీ మేలు జ‌ర‌గాలంటే గులాబీ జెండాను ఆద‌రించాలి. మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థి వెంకట్రామ్ రెడ్డి, జ‌హీరాబాద్ ఎంపీ అభ్య‌ర్థి గాలి వినోద్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు.ఆగ‌మాగ‌మైతే అడ‌వైపోతాం. మీ ఆశీర్వ‌చ‌నంతోనే ఈ రాష్ట్రంలో మ‌ళ్లా బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంట్ గ్యారెంటీగా తెస్తా అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news