మేము కట్టిన సెక్రటేరియేట్‌లో ఎందుకుంటున్నారు? : కేసిఆర్

-

సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మహనీయుడు అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత వచ్చిన మొదటి జయంతి ఇది. అలాంటిది విగ్రహానికి ఒక పువ్వు పెట్టలేదు, ఒక పూలమాల వెయ్యలేదు, అంజలి ఘటించలేదు అని మండిపడ్డారు.

ఈరోజు మెదక్ ,జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తే కనీసం మంచి నీళ్లు పెట్టకుండా, విగ్రహం దగ్గరికి వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారు అని విరుచుకుపడ్డారు. మేము కట్టిన విగ్రహం దగ్గరికి వెళ్లనప్పుడు, మేము కట్టిన సెక్రటేరియేట్‌లో ఎందుకుంటున్నారు? మేము కట్టిన యాదగిరిగుట్ట దగ్గరకు ఎందుకు పోయి మొక్కుకున్నారు? మేము కట్టిన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎందుకుంటున్నారు? అని కెసిఆర్ ప్రశ్నించారు.సెక్రెటేరియేట్ లో సిగ్గు లేకుండా ఎందుకు కూసున్నరు?అంబేద్కర్ గారిని అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news