వాతావరణ శాఖ కీలక అప్డేట్… ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

-

తెలంగాణలో రాగల 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ఆవర్తం కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వెల్లడించింది.

బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌,నిర్మల్‌, జగిత్యాల,కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్‌,మంచిర్యాల, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల,కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది .ఈ నెల 24 వరకు పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాపాతం రికార్డయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news