మైనర్ బాలిక కేసులో దారుణం.. కోరిక తీర్చలేదని చంపిన తండ్రి

-

ప్రస్తుతం రోజు రోజుకు ఎక్కడ ఏమి జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. ముఖ్యంగా అమ్మాయిలకు మాత్రం రక్షణ లేకుండా పోయింది. పక్కింటి వారో, ఎదురింటి వారో బంధువులో ఇలా ఎవ్వరో ఒకరూ వేధిస్తుంటారు. ఇక వారిని పక్కకు సొంతింటి వారే వేధింపులు.. బలవంతం చేయడం వల్ల అమాయకుల బాలికలు నిండు నూరేళ్ల జీవితాన్ని కోల్పోతున్నారు. ఇటీవలే మియాపూర్ లో ఓ మైనర్ బాలిక హత్యకు గురైన విషయం తెలిసిందే.

తాజాగా  మియాపూర్ ఏసీపీ నరసింహారావు మీడియాకు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 12 ఏళ్ల మైనర్ బాలిక హత్య కేసులో దారుణం చోటు చేసుకుంది.  కోరిక తీర్చలేదని కన్న తండ్రే కాలయముడిగా మారాడు. బాలిక(12) మర్డర్ కేసులో ఆమె తండ్రే ప్రధాన సూత్రధారి అని తేల్చేశారు పోలీసులు.  పోర్న్ వీడియోలు చూస్తూ తన ఫోన్ పగిలిపోవడంతో కన్న కూతురినే కోరిక తీర్చాలని అడిగాడు ఆ దుర్భుద్దుడు. ఆ బాలిక తన  తల్లికి చెబుతానని అనడంతో చంపేసాడు కిరాతకుడు. మళ్లీ ఏం తెలియనట్లు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడని వెల్లడించారు ఏసీపీ నరసింహారావు.

 

Read more RELATED
Recommended to you

Latest news