ఏపీ లో కరోనా కలకలం… ఒక్కరోజే 6045 పాజిటివ్ కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కోవిడ్ -19 కేసుల వివరాలను హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 49,553 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 6045 మంది కి కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలుపుకొని మొత్తంగా 64,713 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం జిల్లాలో ఏకంగా 1049 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక మరోవైపు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 6,494 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయబడ్డారు. దీంతో రాష్ట్రంలో 32,127 మంది కోవిడ్ -19 నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 31,763 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. తాజాగా కోవిడ్ -19 బారినపడి 65 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 823 కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14,35,827 శాంపిల్స్ ను పరీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news