రానున్న రోజుల్లో బిజెపితోనే అభివృద్ధి – రాజగోపాల్ రెడ్డి

-

నల్గొండ జిల్లా చండూర్ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తన వెంట పని చేసిన కార్యకర్తలను బెదిరించి మంత్రి జగదీష్ రెడ్డి టీఆరెస్ లో చేర్చుకుంటున్నాడని ఆరోపించారు. దిగజారి అవినీతి సొమ్మతో మంత్రి రాజకీయం చేస్తుండని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నిక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వచ్చిన ఎన్నిక అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర భవిషత్ మార్పు కోసం వచ్చిన ఎన్నికని.. రానున్న రోజుల్లో బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. మూడో సారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రానుందని జోష్యం చెప్పారు రాజగోపాల్ రెడ్డి. తన రాజీనామా తో ఫామ్ హౌస్ నుండి ముఖ్యమంత్రి దిగి వచ్చారని అన్నారు. గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మునుగోడు ప్రజలకు అండగా ఉంటానన్నారు రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version