రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు.. ప్రధాని మోడీకి ఖర్గే లేఖ..!

-

లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్ల పై చేసిన ప్రకటన తరువాత బీజేపీ, దాని మిత్ర పక్షాల నేతలు రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. కేంద్ర మంత్రి రవ్ నీత్ బిట్టు రాహుల్ గాంధీని నెంబర్ వన్ టెర్రరిస్ట్ గా అభివర్ణించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాహుల్ పై దాడి చేస్తామని బెదిరించారు. మరో ఎమ్మెల్యే రాహుల్ నాలుక కోస్తే.. రూ.11లక్షలు ఇస్తానని ప్రకటించారు.

ఈ వ్యాఖ్యలు అన్నీ తీవ్రంగా కలచి వేస్తున్నాయి. భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు విరుద్దం. కాబట్టి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారందరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు మల్లికార్జున్ ఖర్గే. ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి చేసిన ఇలాంటి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారి నుంచి వచ్చాయని గుర్తు చేశారు. ఇలాంటి హింసాత్మక భాష భవిష్యత్ కు పెను ప్రమాదంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version